తెలంగాణ ప్రభుత్వానికి కేటీఆర్ డెడ్‌లైన్

567చూసినవారు
తెలంగాణ ప్రభుత్వానికి కేటీఆర్ డెడ్‌లైన్
బీఆర్ఎస్ ఎమ్మెల్యేల కాళేశ్వరం పర్యటన రెండో రోజు కొనసాగుతోంది. ఈ సందర్భంగా కన్నెపల్లి పంప్ హౌస్‌ను కేటీఆర్, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో సందర్శించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఖాళీగా ఉన్న ప్రాజెక్టులను కాళేశ్వరంతో నింపొచ్చన్నారు. సిస్టమ్ అంతా రెడీ చేసి పెట్టినా కాంగ్రెస్కు వినియోగించుకోవడం తెలియడం లేదన్నారు. నీళ్లు ఎత్తిపోయకపోతే 50వేల మంది రైతులతో తామే వస్తామన్నారు. ఆగస్టు 2 వరకు ప్రభుత్వానికి డెడ్ లైన్ విధిస్తున్నామని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్