చెన్నైలోని చెపాక్ స్టేడియంలో జరిగిన చెన్నై, బెంగళూరు మ్యాచుకు కొందరు రైల్వే స్టేషన్ నుంచి చూశారు. డిమాండ్ ఎక్కువగా ఉండటంతో టికెట్ ధర రూ.15,000 వరకు పలికింది. అయితే అంత ఖర్చు చేయలేని కొందరు మిడిల్ క్లాస్ క్రికెట్ ఫ్యాన్స్ రూ.10 పెట్టి రైల్వే ప్లాట్ఫాం టికెట్ తీసుకొని మ్యాచును రైల్వే స్టేషన్లో నిల్చొని గోడ రంధ్రాల్లోంచి వీక్షించారు.