13 మంది వాలంటీర్లపై వేటు

66చూసినవారు
13 మంది వాలంటీర్లపై వేటు
వైసీపీ తరఫున ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న 13 మంది వాలంటీర్లపై అధికారులు చర్యలు తీసుకున్నారు. అనంతపురం జిల్లా బొమ్మనహాళ్ మండలం దుర్గహొన్నూర్-1, 2 సచివాలయ పరిధిలో పని చేసే 9 మంది వాలంటీర్లు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నట్లు రుజువైంది. దాంతో వారిని విధుల నుంచి తొలగించినట్లు పంచాయతీ కార్యదర్శి కుల్లాయి నాయుడు తెలిపారు. ఏలూరు జిల్లా భట్టువారిగూడెంకు చెందిన నలుగురు వాలంటీర్లను ఎన్నికల అధికారి కె.అద్దయ్య సస్పెండ్ చేశారు.

సంబంధిత పోస్ట్