2024 జనవరి 22న బీజేపీ ప్రభుత్వం ఎంతో అట్టహాసంగా అయోధ్యలో ఆలయాన్ని ప్రారంభించింది. కానీ ఆలయాన్ని ప్రారంభించి ఏడాది కూడా గడవకముందే లీకేజీలు ఏర్పడటం విమర్శలకు తావిస్తోంది. తొలిసారి వర్షం కురిసినప్పుడే గర్భాలయంలోకి నీరు వచ్చి చేరాయి. రామ మందిర నిర్మాణ పటిష్టతపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వాస్తవానికి రామమందిరం ప్రారంభించి 6 నెలలు కూడా కాలేదు. కానీ రామ మందిరం పైకప్పు నుంచి వర్షం నీరు లీక్ కావడం ప్రారంభమైంది.