ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో సీబీఐ తనను విచారించడంపై సవాల్ చేస్తూ ఎమ్మెల్సీ కవిత వేసిన పిటిషన్ పై రౌస్ అవెన్యూ కోర్టులో ఇవాళ విచారణ జరిగింది. సీబీఐ కౌంటర్ వేయకపోవడంపై కవిత తరఫు న్యాయవాది అభ్యంతరం తెలిపారు. కవితను మళ్లీ ప్రశ్నించాల్సి వస్తే ముందే సమాచారం ఇవ్వాలని జడ్జి ఆదేశించారు. సీబీఐ కౌంటర్ వేయకపోవడంపై కవిత తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తామని కోరగా.. తదుపరి విచారణ ఈ నెల 26కు వాయిదా వేశారు.