ఏపీలో నిరుద్యోగ యువతతో చాలామంది గంజాయి రవాణా ఉచ్చులో చిక్కుకొన్నారు. విశాఖ కేంద్ర కారాగారంలో చాలామంది ప్రస్తుతం గంజాయి కేసుల్లో రిమాండులో ఉన్నారు. విశాఖ ఏజెన్సీలో చేపట్టిన ‘ఆపరేషన్ పరివర్తన’ వైసీపీ ప్రభుత్వంలో పూర్తిగా పడకేసింది. ఇంటెలిజెన్స్ నివేదికలు, శాటిలైట్ ఫొటోల ఆధారంగా గంజాయి సాగును గుర్తించినా, దాన్ని పండిస్తున్నవారికి ప్రత్యామ్నాయ జీవనోపాధి కల్పించడం, అక్కడి యువతకు నైపుణ్యాభివృద్ధి శిక్షణ ఇవ్వడంపై కార్యాచరణ కొరవడింది.