లోక్‌సభ ఎన్నికలు.. రెచ్చిపోయిన ఉగ్రవాదులు

84చూసినవారు
లోక్‌సభ ఎన్నికలు.. రెచ్చిపోయిన ఉగ్రవాదులు
లోక్​సభ ఎన్నికల వేళ జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. పూంచ్‌ జిల్లాలోని శశిధర్‌ ప్రాంతంలో భద్రతా బలగాలకు చెందిన కాన్వాయ్‌పై ఉగ్రవాదులు ఒక్కసారిగా కాల్పులకు తెగబడ్డారు. భారత వాయుసేన (IAF)కు చెందిన వాహనంతోపాటు మరో దానిపైనా దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ఒకరు మరణించగా, నలుగురు జవాన్లు గాయపడినట్లు అధికారులు చెప్పారు. కాగా, ఈ ప్రాంతాల్లో గత రెండు ఏళ్లుగా ఉగ్రకార్యకలాపాలు, దాడులు సాగుతునే ఉన్నాయి.

సంబంధిత పోస్ట్