మాజీ మంత్రి ధర్మపురి శ్రీనివాస్ మృతి పట్ల మంత్రి నారా లోకేశ్ సంతాపం తెలిపారు. "కాంగ్రెస్ సీనియర్ నేత, పీసీసీ మాజీ అధ్యక్షుడు ధర్మపురి శ్రీనివాస్ మృతి బాధాకరం. వారి స్మృతికి నివాళులు అర్పిస్తున్నా. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చెరగని ముద్ర వేశారు. వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా." అని పేర్కొంటూ ఎక్స్లో లోకేశ్ పోస్ట్ పెట్టారు.