కర్ణాటక సీఎం సిద్ధరామయ్యలో పాల్గొన్న లోక్సభ ఎన్నికల ర్యాలీలో అనూహ్య ఘటన చోటుచేసుకుంది. ఓ వ్యక్తి నడుముకు తుపాకీ పెట్టుకొని సీఎం ప్రచార ర్యాలీ వాహనంపైకి ఎక్కి హల్చల్ చేశాడు. బెంగళూరులో లోక్సభ ఎన్నికల అభ్యర్థి సౌమ్య రెడ్డి తరఫును సీఎం సిద్ధరామయ్య ప్రచార ర్యాలీలో పాల్గొన్నారు. అయితే గన్ ధరించిన వ్యక్తిని రియాజ్గా పోలీసులు గుర్తించారు. ఆత్మరక్షణ కోసమే అతను కొన్నేళ్ల నుంచి తుపాకీని వెంటపెట్టుకుంటున్నాడని తెలిపారు.