ఉత్తరప్రదేశ్ లోని కాన్పూర్లోని కచువా చెరువు సమీపంలోని తాజాగా షాకింగ్ ఘటన జరిగింది. రాయ్బరేలీకి చెందిన శివ, గుంజన్ అనే యువతి రెండు నెలల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. పెళ్లయినప్పటి నుంచి శివ డ్రగ్స్కు బానిసయ్యాడు. దీంతో భార్య విడాకులు ఇచ్చింది. ఆమెపై కోపంతో మంగళవారం డ్రగ్స్ మత్తులో భార్యపై దాడి చేసి గొంతుకోసి చంపాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని దర్యాప్తు ప్రారంభించారు.