అయిజలో రెచ్చిపోతున్న దొంగల ముఠా

8465చూసినవారు
అయిజలో రెచ్చిపోతున్న దొంగల ముఠా
జోగులాంబ గద్వాల జిల్లా అయిజ మండల కేంద్రంలో మంగళవారం వరుస దొంగతనాలు జరుగుతుండటంతో ప్రజలు, చిరు వ్యాపారులు భయభ్రాంతులకు గురవుతున్నారు. గత అర్ధరాత్రి గెస్ట్ హౌస్ సమీపంలో ఉన్న రెండు టీ స్టాల్ లో చోరీ జరిగింది. గతంలో అదే సమీపంలో ఒక టీ స్టాల్లో, ఆటో మొబైల్స్ షాప్ లో, ఓ ఇంటి దగ్గర బైకును చోరీ చేశారు. దీనిపై జిల్లా పోలీసు యంత్రాంగం కట్టుదిట్టమైన నిఘా పెట్టాలని ప్రజలు కోరుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్