కారు ఆటో ఢీ.. పలువురికి గాయాలు

4929చూసినవారు
భూత్పూర్ మండలం శేర్ పల్లి (బీ ) వద్ద శుక్రవారం భూత్పూర్ నుండి జడ్చర్ల వైపు వెళుతున్న ప్యాసింజర్ ఆటోను వెనుక నుండి కారు ఢీకొట్టింది. దీంతో ఆటోలో ప్రయాణిస్తున్న భూత్పూర్ మండలం తాటి పర్తి గ్రామానికి చెందిన పలువురికి గాయాలు అయ్యాయి. ఒక విద్యార్థికి తీవ్ర గాయాలు కాగా మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ తరలించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

సంబంధిత పోస్ట్