దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూధన్ రెడ్డి సోమవారం పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. నియోజకవర్గంలోని భూత్పూర్ మండలం తాటి కొండ, హస్న పూర్, షేర్ పల్లి, కప్పేట, కొత్త మొల్గర, మదిగట్ల గ్రామాలలో పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి చల్లా వంశీ చంద్ రెడ్డి తో కలిసి ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారని కాంగ్రెస్ పార్టీ నాయకులు ఓ ప్రకటనలో తెలిపారు.