సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి ఆరో దశ నోటిఫికేషన్ను ఈసీ విడుదల చేసింది. ఈ విడతలో 7 రాష్ట్రాల్లోని మొత్తం 57 లోక్సభ స్థానాలకు మే 25న పోలింగ్ జరగనుంది. బిహార్లో 8, హర్యానాలో 10, జార్ఖండ్లో 4, ఒడిశాలో 6, ఉత్తరప్రదేశ్లో 14, పశ్చిమబెంగాల్లో 8, ఢిల్లీలో 7 స్థానాలకు ఎన్నికలు జరుగుతాయి. ఇవాళ్టినుంచి అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేసుకోవచ్చు.