స్టాక్ మార్కెట్లు, బీమా కంపెనీలు, ఆన్లైన్ చెల్లింపులు గేట్వే ఇంటర్మీడియర్లు, క్రిప్టో కరెన్సీ సేవల ప్రొవైడర్లకు భారత ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్ (FIU) హెచ్చరికలు జారీచేసింది. ఆయ చానెళ్ల ద్వారా మనీలాండరింగ్ కార్యకలాపాలు, ఉగ్రవాదులకు నిధులను అందజేసే లావాదేవీలు జరుగుతున్నాయేమో పరిశీలించేందుకు తనిఖీలు నిర్వహించే అవకాశం ఉందని హెచ్చరించింది. ఇందులో భాగంగా అనుమానాస్పద లావాదేవీలకు FIUకు తెలియజేయాల్సి ఉంటుంది.