కూల్చిన ఇళ్లు పరిశీలించిన మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్

72చూసినవారు
మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని క్రిస్టియన్ పల్లి సమీపంలోని ఆదర్శనగర్ లో గురువారం ప్రభుత్వ అధికారులు కూల్చిన ఇళ్లను మాజీమంత్రి శ్రీనివాస్ గౌడ్ సందర్శించారు. కాగా ఓ బాధితురాలు తీవ్ర ఆవేదనతో కన్నీరు పెట్టుకుంది. శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం పేదల ఇళ్లను దౌర్జన్యంగా కూల్చుతుందని అన్నారు. బాధితులు ఎక్కడికి వెళ్లొద్దని, ఇక్కడే ఉండాలన్నారు. ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్