తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని చంపేయాలని డీకే అరుణ కడుపులో కత్తులు పెట్టుకొని వస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఆమె కాంగ్రెస్ పార్టీ జడ్పీటీసీ, ఎమ్మెల్యే, మంత్రిగా చేస్తే అలాంటి పార్టీపై కుట్ర చేస్తోందని మండిపడ్డారు. కుట్రలు చేసే వారిని లోక సభ ఎన్నికలలో ఓడించాలని ఆదివారం ఎర్రవల్లిలో పిలుపునిచ్చారు. నడిగడ్డ అంటేనే పౌరుషానికి ప్రతీక అని, అందుకే పార్లమెంట్ ఎన్నికలలో సత్తా చూపించాలని అన్నారు.