ప్రమాదవశాత్తు బావిలో పడి ఇంటర్ విద్యార్థి మృతి

10507చూసినవారు
ప్రమాదవశాత్తు బావిలో పడి ఇంటర్ విద్యార్థి మృతి చెందిన ఘటన శనివారం జోగులాంబ గద్వాల జిల్లాలో చోటుచేసుకుంది. అయిజ మండలంలో చిన్న తాండ్రపాడు దేవేందర్ గౌడ్, పద్మావతిల కుమారుడు భూపతిగౌడ్ (17) శనివారం తనతాతా రామన్న పొలంలో ఉన్న అమ్మవారికి కొబ్బరికాయ కొట్టాడని వెళ్లాడు. ఈ క్రమంలో స్నానం చేసి వస్తానని బావి వద్దకు వెళ్లాడు. ఎంతసమయం గడిచినా బాలుడు రాకపోవడంతో కుటుంబీకులు వెళ్లి చూడగా బావిలో విగతజీవిగా కన్పించాడు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్