లోక్ సభ ఎన్నికల్లో గెలుపు బాటలో బీఆర్ఎస్ పార్టీ పయనిస్తోందని ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి పేర్కొన్నారు. గురువారం జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ చౌరస్తాలో బీఆర్ఎస్ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, ఎమ్మెల్యే విజయుడు తో కలిసి ఆయన రోడ్ షో నిర్వహించారు. రోడ్ షో కు జనం అధిక సంఖ్యలో తరలివచ్చారు. పార్టీని గెలిపించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని ఆయన గుర్తు చేశారు.