తిమ్మప్ప స్వామి ఆలయానికి పోటెత్తిన భక్తులు

65చూసినవారు
జోగంబ గద్వాల జిల్లా మల్దకల్ మండల కేంద్రంలో వెలిసిన తిమ్మప్ప స్వామి ఆలయానికి చైత్ర మాసం శనివారం భక్తులు పెద్ద సంఖ్యలో స్వామిని దర్శించుకున్నారు. ఇందులో భాగంగా అర్చకులు స్వామివారికి ఉదయం అభిషేకం, అలంకార సేవ, ఆకు పూజ, నివేదన సేవ తదితర పూజా కార్యక్రమాలు నిర్వహించి భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో మండల కేంద్రానికి చెందిన రమేష్ ఆధ్వర్యంలో భక్తులకు అన్నదానం చేశారు.

సంబంధిత పోస్ట్