జోగులాంబ గద్వాల జిల్లా అయిజ పట్టణంలో శనివారం నాగర్ కర్నూల్ లోక్ సభ స్థానానికి స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిచిన పాలాది నాగరాజు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. స్వతంత్ర అభ్యర్థులను ఎన్నుకోవాల్సిన అవసరం ఏర్పడిందని ఆయన పట్టణవాసులకు సూచించారు. విద్య, వైద్యం తదితరాల అభివృద్ధికి కృషి చేస్తామన్నారు.