జోగులాంబ గద్వాల జిల్లా మండల కేంద్రమైన ఎర్రవల్లి వద్ద జాతీయ రహదారిపై గురువారం రాత్రి 10 గంటల ప్రాంతంలో జోరుగా వర్షం కురిసింది. సుమారు గంటసేపైనా తెరపి ఇవ్వకుండా కురుస్తుండడంతో వాహన చోదకులు ఇబ్బందిపడ్డారు. సాయంత్రం నుంచి ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు కురిశాయి. రాత్రి ఏకంగా భారీ వర్షం నమోదయింది.