మిషన్ భగీరథ పైప్ లైన్ మరమ్మత్తు చేయండి..!

551చూసినవారు
జోగులాంబ గద్వాల జిల్లా అయిజ మండలం మేడికొండలో మిషన్ భగీరథ పైప్ లైన్ పగిలిపోయి తాగునీరు వృధా అవుతుంది. రెండు నెలలుగా నీరు వృధా అవుతున్నా సంబంధిత అధికారులు పట్టించుకోవడంలేదని గురువారం గ్రామస్తులు వాపోయారు. పైప్ లైన్ పగిలి పోవడం వల్ల ఇండ్లకు నీళ్ళు రావడం లేదని, దీంతో తాగునీటికి ఇబ్బంది ఏర్పడిందని తెలిపారు. అధికారులు స్పందించి వెంటనే పైప్ లైన్ మరమ్మత్తు చేయాలంటున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్