బాలికపై ఓ వ్యక్తి లైంగిక దాడికి పాల్పడిన ఘటన ఆలస్యంగా జోగులాంబ గద్వాల జిల్లా వెలుగు చూసింది. కేటీదొడ్డి మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలికను అదే గ్రామానికి చెందిన కొండన్న ప్రేమ పేరుతో వేధించంగా బాలిక తల్లిదండ్రులు అతడిని మందలించారు. అయినా అతడి ప్రవర్తనలో మార్పు రాకపోగా.. గత మే నెలలో బాలికపై సదరు వ్యక్తి లైంగిక దాడికి పాల్పడ్డాడు. దీంతో వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని సోమవారం బాలిక డీస్పీకి ఫిర్యాదు చేసింది.