శ్రీరామ నవమి వేడుకలను పురస్కరించుకొని జోగులాంబ గద్వాల జిల్లా అయిజ మండలం కిష్టాపురం గ్రామంలో ఉన్న రామాంజనేయ స్వామి ఆలయంలో శ్రీరామ నామావళి భజన నిర్వహించారు. 24 గంటల నిరంతర భజన కార్యక్రమంలో భాగంగా మంగళవారం రాత్రి 8 గంటల నుంచి బుధవారం ఉదయం 8 గంటల వరకు భజన కార్యక్రమాలను నిర్వహించారు. బుధవారం ఉదయం నిరంతర శ్రీరామ నామావళి భజనను ముగించారు.