శ్రీరామ నామావళి నిరంతర భజన

78చూసినవారు
శ్రీరామ నవమి వేడుకలను పురస్కరించుకొని జోగులాంబ గద్వాల జిల్లా అయిజ మండలం కిష్టాపురం గ్రామంలో ఉన్న రామాంజనేయ స్వామి ఆలయంలో శ్రీరామ నామావళి భజన నిర్వహించారు. 24 గంటల నిరంతర భజన కార్యక్రమంలో భాగంగా మంగళవారం రాత్రి 8 గంటల నుంచి బుధవారం ఉదయం 8 గంటల వరకు భజన కార్యక్రమాలను నిర్వహించారు. బుధవారం ఉదయం నిరంతర శ్రీరామ నామావళి భజనను ముగించారు.

సంబంధిత పోస్ట్