సుబాబుల్ తోటలకు నిప్పు

9841చూసినవారు
సుబాబుల్ తోటలకు నిప్పు
జోగులాంబ గద్వాల జిల్లా బుడమర్సు గ్రామంలో శనివారం సాయంత్రం అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. గ్రామ పరిధిలో తుంగభద్ర నది అంచున ఉన్న సుబాబుల్ తోటలకు గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టారు. ఈ సంఘటనలో సుబాబుల్ తోటలు పూర్తిగా దగ్ధమైంది. విషయం తెలుసుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. అగ్ని ప్రమాదంలో లక్షల్లో నష్టపోవాల్సి వచ్చిందని రైతులు బోరున విలపించారు. వారిని ప్రభుత్వం ఆదుకోవాలని రైతులు కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్