జోగులాంబ గద్వాల జిల్లా ఉండవెల్లి మండలం పుల్లూరు గ్రామంలో ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి, ఎమ్మెల్యే విజయుడు ఓటు హక్కును వినియోగించుకున్నారు. గ్రామంలోని జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో వారిద్దరూ ఓటేశారు. అనంతరం పార్టీ శ్రేణులతో మాట్లాడారు.