వైభవంగా ర్యాకంకొండా స్వామి వారి రథోత్సవం
హన్వాడ మండలంలోని మాదారం గ్రామంలో ర్యాకంకొండా స్వామి వారి రథోత్సవం సోమవారం అర్ధరాత్రి వైభవంగా సాగింది. ఆలయ పూజారులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయంలోని ఉత్సవ మూర్తులను అందంగా అలంకరించి, రథాంగ హోమం చేసి హారతినిచ్చారు. మంగళవాయిద్యాలు, వేదపండితుల మంత్రోచ్చారణల, భక్తజనం శివనామస్మరణల నడుమ రథాన్ని భక్తిశ్రద్ధలతో ముందుకు లాగారు. రథోత్సవంలో అడుగుల భజనలు, కోలాటాలు అందరిని ఆకట్టుకున్నాయి.