మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని కాటన్ మిల్ వెంకటేశ్వర స్వామిని ఎంపీ డీకే అరుణ శుక్రవారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా డీకే అరుణకు ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో ఘనంగా స్వాగతం పలికారు. స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో పాలమూరు ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని వేడుకున్నారు.