ప్రజలు సురక్షిత ప్రాంతాలలో ఉండాలి: ఎమ్మెల్యే యెన్నం

84చూసినవారు
ప్రజలు సురక్షిత ప్రాంతాలలో ఉండాలి: ఎమ్మెల్యే యెన్నం
మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని పాత ఇండ్లలో నివసిస్తున్న ప్రజలు సురక్షిత ప్రాంతాలలో ఉండాలని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాసరెడ్డి సూచించారు. సోమవారం మోతినగర్ లోని లోతట్టు ప్రాంతాలను పరిశీలించారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని మున్సిపల్ అధికారులకు ఎమ్మెల్యే సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ఆనంద్ గౌడ్, కౌన్సిలర్లు, అధికారులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్