మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో రోడ్డు ప్రమాదం

4009చూసినవారు
మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో బుధవారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్ ఎదుట రాయచూరు వైపు వెళ్తున్న భారత్ బెంజ్ టిప్పర్ మారుతి ఆల్టో కారు పరస్పరం ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో కారు పాక్షికంగా ధ్వంసమైంది. నడి రోడ్డుపై వాహనాలను నిలిపివేసి టిప్పర్, కారు డ్రైవర్లు ఘర్షణకు దిగారు. రోడ్డుపై ట్రాఫిక్ అంతరాయం ఏర్పడగా ట్రాఫిక్ పోలీసులు చేరుకొని రోడ్డుపై ట్రాఫిక్ క్లియర్ చేశారు.

సంబంధిత పోస్ట్