మహబూబ్ నగర్ జిల్లాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంగళవారం పర్యటించారు. ఈ సందర్భంగా రూ. 396. 09 కోట్లతో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం వనమహోత్సవం కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటి నీరు పోశారు. ఆయన వెంట రాష్ట్రం మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.