డీకే అరుణ ఓటు ఎక్కడ..?
బీజేపీ మహబూబ్నగర్ ఎంపీ అభ్యర్థి డీకే అరుణ ఓటు జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని 29 వ వార్డు అశోకనగర్ లోని 261 పోలింగ్ బూత్ లో ఉండేది. 2019లో బీజేపీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసినప్పుడు కూడా ఆమె తన ఓటు గద్వాలలోనే వినియోగించుకున్నారు. ఈ సారి మాత్రం గద్వాల నుంచి తన ఓటును మహబూబ్ నగర్ పట్టణం టీచర్స్ కాలనీ బ్రిలియంట్ స్కూల్ లో ఏర్పాటు చేసిన 113పోలింగ్ బూత్ కు మార్చుకున్నారు. సోమవారం ఈ కేంద్రంలో ఓటు వేయనున్నారు.