
పాలమూరు అయ్యప్ప కొండ మహా పడిపూజలో పాల్గొన్న ఎంపీ, ఎమ్మెల్యే
మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని అయ్యప్ప కొండఫై బుధవారం నిర్వహించిన హరిహరపుత్ర అయ్యప్ప స్వామి మహా పడిపూజలో స్థానిక ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాసరెడ్డి, ఎంపీ డీకే అరుణ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. వారు మాట్లాడుతూ అయ్యప్ప స్వామి కృపా కటాక్షాలు మనందరిపై మెండుగా ఉండాలని అన్నారు. శబరిమల అయ్యప్పస్వామి సన్నిధిలో నిర్వహించే పూజలకు సమానంగా పాలమూరులో నిర్వహించడంలో పాలుపంచుకోవడం సంతోషంగా ఉందని అన్నారు.