బదిలీ అయిన ఉపాధ్యాయులకు ఘనంగా వీడ్కోలు

76చూసినవారు
బదిలీ అయిన ఉపాధ్యాయులకు ఘనంగా వీడ్కోలు
కల్వకుర్తి నియోజకవర్గ పరిధిలోని లింగసాని పల్లి ప్రాథమికోన్నత పాఠశాలలో ఇటీవల బదిలీ అయిన ఉపాధ్యాయులు చంద్రశేఖర్, మహేశ్వరి, వెంకటేష్, మహేశ్వర్ లకు పాఠశాల ప్రధానోపాధ్యాయులు నెహ్రూ ప్రసాద్ ఆధ్వర్యంలో శుక్రవారం ఘనంగా వీడ్కోలు పలికారు. ఈ సమావేశానికి టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు జంగయ్య ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రసంగించారు. మరో అతిథి జెడ్ పి హెచ్ ఎస్ గుండూరు కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు వెంకటయ్య పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్