నారాయణపేట జిల్లా మక్తల్ లో శాశ్వత ఆధార్ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని గురువారం స్థానిక పట్టణంలో 167వ జాతీయ రహదారిపై ప్రజలు రాస్తారోకో చేపట్టారు. జిల్లా కలెక్టర్ చొరవతో ఏర్పాటుచేసిన ఆధార్ సెంటర్స్ గడువు ముగియడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ప్రజలు ఆగ్రహంతో ఆవేదన వ్యక్తం చేశారు. రాస్తారోకో దగ్గరకు వచ్చిన ఎమ్మార్వో శాశ్వత ఆధార్ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.