మక్తల్ లో మహాత్మా గాంధీకి ఘననివాళి

60చూసినవారు
నారాయణపేట జిల్లా మక్తల్ లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మంగళవారం జాతిపిత మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా శ్రీకన్యకా పరమేశ్వరి ఆలయ అవరణలో ఉన్న గాంధీ విగ్రహానికి నాయకులు కార్యకర్తలు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షులు గణేష్ కుమార్, పట్టణ అధ్యక్షులు రవికుమార్, మాజీ జెడ్పిటిసి లక్ష్మారెడ్డి, మాజీ ఎంపిటిసి కోళ్ల వెంకటేష్, కట్ట వెంకటేష్, పసుల రంజిత్ రెడ్డి పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్