లోక్ సభ ఎన్నికల్లో భాగంగా నాగర్ కర్నూల్ పార్లమెంట్ స్థాయి కాంగ్రెస్ పార్టీ సమీక్షా సమావేశం బుధవారం తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ దీపా దాస్ మున్షి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సమావేశం కార్యక్రమంలో మంత్రి జూపల్లి కృష్ణారావు, పార్లమెంట్ అభ్యర్థి మల్లు రవి, తెలంగాణ రాష్ట్ర ఇరిగేషన్ కార్పొరేషన్ చైర్మన్ చింతలపల్లి జగదీశ్వర్ రావు, ఎమ్మెల్యేలు తుడి మేఘారెడ్డి, జడ్పీ చైర్మన్ సరిత, తదితరులు పాల్గొన్నారు.