నల్లమల్ల చెక్ పోస్టుల నిబంధనల సడలింపు

2231చూసినవారు
నల్లమల్ల చెక్ పోస్టుల నిబంధనల సడలింపు
నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలంలోని మన్ననూరు, దోమలపెంట చెక్ పోస్టుల వద్ద ఉగాది పండుగ సందర్భంగా అటవీ నిబంధనలను సడలించినట్లు అమ్రాబాద్ రేంజ్ అధికారి ఆదిత్య సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. 6 నుంచి 11వ తేదీ వరకు మన్ననూరు, దోమలపెంట చెక్ పోస్టుల వద్ద 24 గంటల పాటు వాహనాలను అనుమతించనున్నట్లు, రాత్రి 9 నుంచి ఉదయం 6 గంటల వరకు వాహనాలకు అనుమతిస్తున్నప్పటికీ ఒకే సారి కాకుండా కొన్ని వాహనాలను కలిపి పంపిస్తున్నారు.

సంబంధిత పోస్ట్