వైభవంగా దుర్గామాత విగ్రహాల ఊరేగింపు

75చూసినవారు
శరన్నవరాత్రి ఉత్సవాలు పురస్కరించుకొని నారాయణపేట జిల్లా కేంద్రంలో గురువారం సాయంత్రం దుర్గామాత విగ్రహాలను నిర్వాహకులు ఊరేగింపుగా ఆలయాలకు, మండపాలకు తరలించారు. ఊరేగింపులో మహిళలు కోలాటాలు, దాండియా నృత్యాలు చేశారు. దుర్గాదేవి విగ్రహాలను స్థాపన చేసి తొమ్మిది రోజుల పాటు వివిధ రకాల అలంకరణలో అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అనంతరం చెరువులో నిమజ్జనం చేస్తారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్