వార్డులలో ప్రచారం చేసిన నేతలు

60చూసినవారు
వార్డులలో ప్రచారం చేసిన నేతలు
నారాయణపేట పట్టణంలోని పలు వార్డులలో బుధవారం కాంగ్రెస్ పార్టీ నేతలు ఇంటింటి ప్రచారం చేశారు. 2, 10, 11, 15, 23, వార్డులలో ఇంటింటికి తిరుగుతూ మ్యానిఫెస్టో పత్రాలను ప్రజలకు అందించి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి గెలిపించాలని కోరారు. సమస్యల పరిష్కారానికి, పట్టణ అభివృద్ధికి అండగా నిలబడాలని కోరారు. ఎంపీగా చల్ల వంశీచంద్ రెడ్డిని గెలిపించాలని ప్రజలను కోరారు. వార్డుల అధ్యక్షులు, నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్