ఎన్డీఏ కూటమిని ఓడించాలి: రాము

69చూసినవారు
ఎన్డీఏ కూటమిని ఓడించాలి: రాము
ఎన్డీఏ కూటమిని ఓడించాలని సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ పార్టీ జిల్లా కార్యదర్శి రాము అన్నారు. నారాయణపేట పట్టణంలోని కూరగాయల మార్కెట్ లో కర పత్రాలు పంపిణీ చేశారు. దేశంలో ఫాసిస్టు, మతోన్మాద విధానాలు ప్రోత్సహిస్తూ పాలిస్తున్న ఎన్డీఏ కూటమిని ఓడించాలని ప్రజలను కోరారు. కార్పొరేట్లకు అనుకూలంగా పని చేస్తున్న ప్రభుత్వాన్ని ఓడించాలన్నారు. ఇండియా కూటమిని బలపరిచి అధికారంలోకి తేవాలని అన్నారు. నాయకులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్