ఘనంగా స్వయం పరిపాలన దినోత్సవం

549చూసినవారు
ఘనంగా స్వయం పరిపాలన దినోత్సవం
నారాయణపేట జిల్లా, కోస్గి మండలంలో గల బొల్వాని పల్లి పాఠశాల నందు గురువారం స్వయం పరిపాలన దినోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా జిల్లా విద్యాధికారిగా సాయిప్రియ, మండల విద్యాధికారిగా హరిక, ప్రధానోపాధ్యాయులుగా అశోక్, పి. ఇ. టిగా తిరుమలేశు వ్యవహరించారు. విద్యార్థులు వారి పాత్రలు చక్కగా నిర్వహించి ప్రశంసలు పొందారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయుడు నరసింహ, విద్యార్థులు పాల్గొని విజయవంతం చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్