ఏపీలో 38 డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి నిర్వహించే స్క్రీనింగ్ పరీక్ష వాయిదా పడింది. సార్వత్రిక ఎన్నికలు, డీఎస్సీ పరీక్షలు ఉండటంతో పాటు అభ్యర్థుల విజ్ఞప్తి మేరకు ఈ పరీక్షను రీషెడ్యూల్ చేస్తున్నట్లు APPSC వెల్లడించింది. షెడ్యూల్ ప్రకారం ఏప్రిల్ 13న ఈ పరీక్ష జరగాల్సి ఉండగా.. మే 25వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు తెలిపింది.