వ్యక్తి దారుణ హత్య !

4665చూసినవారు
వ్యక్తి దారుణ హత్య !
నారాయణపేట జిల్లా కడ్తాల్ మండలం మక్తమాదారం గ్రామ సమీపంలో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. స్థానికంగా ఉన్న ఓ వెంచర్లో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. సదరు వ్యక్తిని హత్య చేసి వెంచర్లో వేసి వెళ్లినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్