వనపర్తి బాలికల పాఠశాలను సందర్శించిన మైనార్టీ కమిషన్

70చూసినవారు
వనపర్తి బాలికల పాఠశాలను సందర్శించిన మైనార్టీ కమిషన్
వనపర్తి జిల్లా పర్యటనలో భాగంగా బుధవారం జాతీయ మైనార్టీ కమిషన్ సభ్యురాలు సయ్యద్ షేహజాది జిల్లా కేంద్రంలోని మైనారిటీ బాలికల పాఠశాలను సందర్శించారు. అనంతరం ఆమె విద్యార్థులతో మాట్లాడి అందుతున్న సౌకర్యాలను అడిగి తెలుసుకున్నారు. పాఠశాలలో ఉన్న మౌలిక వసతులను, విద్యార్థుల నమోదును పరిశీలించారు. అమ్మాయిలు ఎందులోనూ తక్కువ కాదని, ఏ సమస్య వచ్చిన ఇంకొకరిపై ఆధారపడకుండా ధైర్యంగా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలన్నారు.

సంబంధిత పోస్ట్