తేనెటీగల దాడిలో యువకుడు దుర్మరణం

84చూసినవారు
తేనెటీగల దాడిలో యువకుడు దుర్మరణం
తేనెటీగల దాడిలో యువకుడు మృతి చెందిన ఘటన నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం మన్ననూరులో గురువారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన తారక్(22) తన వ్యవసాయ పొలంలో ట్రాక్టర్తో నేలను దున్నుతున్న క్రమంలో చెట్టు పై ఉన్న తేనెటీగలు ఒకసారిగా తారక్ పై దాడి చేయడంతో వాటి నుంచి తప్పించుకునే క్రమంలో పరిగెత్తుకుంటూ పొలంలో వెళుతుండగా బోర్లపడి మృతి చెందాడు. తారక్ అవివాహితుడు గ్రామంలో విషాదం నెలకొంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్