పారదర్శకంగా ఇళ్లు పంపిణీ : మంత్రి సబితా

463చూసినవారు
రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం మన్సన్ పల్లిలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను పారదర్శకంగా పంపిణీ చేశామని విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. శుక్రవారం జడ్పీ చైర్ పర్సన్ అనిత రెడ్డి, ఎమ్మెల్సీలు సురభి వాణీదేవి , దయనంద్ గుప్తా, యెగ్గే మల్లేశం,కలెక్టర్ హరీష్ తో కలిసి లక్కీ డ్రా ద్వారా డబుల్ బెడ్ రూమ్ లు పొందిన వారికి సంబంధిత పత్రాలు, తాళాలు అందించారు. గూడు లేని పేదలను పక్కాగా గుర్తించి డ్రా కు ఎంపిక చేసినట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్