CMను చంపుతానని బెదిరింపులు.. వ్యక్తి అరెస్ట్(VIDEO)

41622చూసినవారు
ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ను చంపుతానని బెదిరించిన ఓ వ్యక్తిని పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. ఢిల్లీలోని రాజీవ్ చౌక్, పటేల్ నగర్ మెట్రో స్టేషన్లలో గోడలపై నిందితుడు గ్రాఫిటీ రాశాడు. ఆ వీడియో నెట్టింట వైరల్ అయింది. నిందితుడిని అంకిత్ గోయల్ (33)గా పోలీసులు గుర్తించారు. నిందితుడు ఉన్నత విద్యావంతుడు, ప్రముఖ బ్యాంకులో పనిచేస్తున్నాడని పోలీసులు తెలిపారు. అతనికి ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదని వెల్లడించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్