హోళీ పండుగ రోజున మహారాష్ట్రలో సెల్ టవర్ ఎక్కి ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఛత్రపతి శంభాజీనగర్లోని పోలీస్ కమిషనర్ కార్యాలయం సమీపంలో ఓ యువకుడు మొబైల్ టవర్ ఎక్కి ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని.. సదరు యువకుడి మృతదేహాన్ని కిందికి దింపేశారు. కాగా, ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.